రైల్వే శాఖ సంచలన నిర్ణయం.... ఆగస్టు 12 వరకు రెగ్యులర్ రైళ్లు రద్దు....?
దేశంలో కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తున్న నేపథ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్ట్ 12 వరకూ రెగ్యులర్ ట్రైన్ సేవలను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ నుంచి కీలక ప్రకటన వెలువడింది. జూలై 1 నుంచి ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న వారి నగదు రిఫండ్ చేస్తామని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా రాకపోకలు సాగిస్తున్న 230 ప్రత్యేక రైళ్లు యథావిధిగా నడుస్తాయని రైల్వే శాఖ పేర్కొంది.
కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. జులై 1 నుంచి రైలు ప్రయాణాలు చేయాలనుకున్న ప్రయాణికులకు ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. పరిమిత సంఖ్యలో దేశీయ విమాన సర్వీసులకు అనుమతులు ఇచ్చిన కేంద్రం రైళ్లకు అనుమతిస్తే వైరస్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని భావించి ఈ నిర్ణయం తీసుకుంది.
It has been decided that regular time-tabled passenger services including Mail/Express, passenger and suburban services stand cancelled up to 12.08.2020: Railway Board pic.twitter.com/Pt1EIreC5y — ANI (@ANI) June 25, 2020