దారుణం.. పిల్లల గొంతు కోసి తండ్రి ఆత్మహత్య!
దేశంలో కరోనాతో జనాలకు నానా కష్టాలు వచ్చిపడ్డాయి. పని చేసుకుంటే కానీ ఆ పూట గడవని వారు ఎన్ని కష్టాలు పడుతున్నారో కళ్లారా చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి అప్పుల్లో కూరుకుపోయాడు. ఒదే సందర్భంలో తన బార్యతో మాటలు లేవు.. కుటుంబం కూడా అతన్ని దూరం చేసింది. దీంతో తన పిల్లల గొంతు కోసి అతను ఆత్మహత్య చేసుకున్నాడు. కైలాష్ పర్మార్ అనే 40 ఏళ్ల వ్యక్తికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ముగ్గురిలో ఒకరు పదేళ్ల కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. వారి వయసు ఒకరిది 8 సంవత్సరాలు కాగా, మరొకరిది ఐదు సంవత్సరాలు.
గత కొంత కాలంగా కుటుంబ పోషణ.. అతని సొంత పనులకు అడ్డగోలిగా అప్పులు చేశాడు. ఆర్థిక సమస్యలు ఎక్కువయ్యాయి. భార్య, కుటుంబంతో గొడవలు ఉన్నాయి. ఒక వైపు అప్పులు, మరో వైపు కుటుంబ సమస్యలు.. దీంతో ఏం చేయాలో తోచక.. కైలాష్ తన ముగ్గురు పిల్లలను గొంతు కోసి చంపాడు.
ఆ తర్వాత అతను ఆత్మహత్య చేసుకున్నాడు.ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.