గుంటూరులో దారుణం..... పాతకక్షల వల్ల టీడీపీ కార్యకర్తను హత్య చేసిన ప్రత్యర్థులు...?

Reddy P Rajasekhar

గుంటూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పాతకక్షల వల్ల టీడీపీ నేత విక్రమ్ దారుణ హత్యకు గురయ్యాడు. పూర్తి వివరాలలోకి వెళితే గురజాల మండలం అంబాపురానికి చెందిన టీడీపీ కార్యకర్త దోమతోటి విక్రమ్ నిన్న అర్ధరాత్రి బైక్ పై వెళుతున్న సమయంలో ప్రత్యర్థులు దాడి చేసి హత్య చేశారు. మారణాయుధాలతో దాడి చేయడంతో ఘటనాస్థలంలోనే విక్రమ్ మృతి చెందాడు. 
 
విక్రమ్ తో పాటు ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయాలపాలైన వ్యక్తులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాడి చేసిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు ప్రాథమికంగా పాతకక్షలే విక్రమ్ హత్యకు కారణమని నిర్ధారణకు వచ్చారు. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: