టాలీవుడ్ నిర్మాతపై శోభారాణి ఫిర్యాదు...
టాలీవుడ్కు చెందిన ప్రముఖ సినీ నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రామకృష్ణ తనకు చెల్లించాల్సిన అద్దె మొత్తం ఇవ్వకుండా నాలుగేళ్లుగా ఇబ్బంది పెడుతున్నాడంటూ శోభారాణి అనే మహిళ ఫిర్యాదు చేసింది. బాధితురాలు చెప్పిన దాని ప్రకారం మినిస్టర్స్ క్వార్టర్స్ ఎదురుగా ఉండే తన భవనాన్ని 2018లో ఆమె రామకృష్ణ గౌడ్కు అద్దెకు ఇచ్చారు. అక్కడ రామకృష్ణ తెలంగాణ ఫిలిం కల్చరల్ సెంటర్ (టీఎఫ్సీసీ) ఏర్పాటు చేశారు. నెలకు రూ. 4.50 లక్షల అద్దె, అడ్వాన్స్ రు. 40 లక్షలు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది.
అయితే అడ్వాన్స్ కేవలం రు. 30 లక్షలు మాత్రమే ఇచ్చి.... ఆ తర్వాత సక్రమంగా అద్దె చెల్లించలేదని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అదేమని అడిగితే తనకు ప్రభుత్వ పెద్దల అండదండలు ఉన్నాయని బెదిరిస్తున్నాడని.. ప్రతాని కుమారుడు సందీప్ తన ఇంటి వద్దకు వచ్చి దౌర్జన్యానికి పాల్పడ్డాడన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.