మాజీ ప్రధాని స్మారక ముద్ర విడుదల చేసిన కేంద్రం..
భారతదేశ 10వ ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టి నత్తనడకన నడుస్తున్న భారత ఆర్థిక వ్యవస్థ ను తనదైన సంస్కరణలతో పరుగులు పెట్టించి... రైతే రాజు అనే విధంగా పాలన సాగించిన ప్రధానమంత్రి పీవీ నరసింహారావు. జూన్ 28వ తేదీన పీవీ నరసింహారావు జయంతి జరిగిన విషయం తెలిసిందే.
అయితే తాజాగా మాజీ ప్రధాని దివంగత పి.వి.నరసింహారావు స్మరించుకుంటూ కేంద్ర ప్రభుత్వం మాజీ ప్రధాని కి ఒక స్మారక ముద్ర ను విడుదల చేసింది.