మనుషుల్లో మానవత్వం చచ్చిపోతుంది: యాంకర్ రష్మి గౌతమ్
తాజాగా నెల్లూరులో వెలుగుచూసిన దుర్ఘటన అందరినీ కలిచివేసింది. ఏపీ టూరిజం హోటల్ కార్యాలయంలో మహిళా ఉద్యోగి పై జరిగిన దాడికి ప్రముఖ నటి, యాంకర్ రష్మి గౌతమ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇది చాలా అమానుషమైన ఘటన గా అభివర్ణించారు. మనం ఎలాంటి సమాజంలో జీవిస్తున్నామని ఇలాంటి సంఘటన చూసినప్పుడు మానవత్వం చచ్చిపోతుందని అన్నారు.
నెల్లూరులోని ఏపీ టూరిజం హోటల్ కార్యాలయంలో కాంట్రాక్ట్ మహిళా ఉద్యోగి ఉషారాణిపై డిప్యూటీ మేనేజర్ భాస్కర్.. ఇనుపరాడ్డుతో దాడి చేశాడు. కరోనా నేపథ్యంలో మాస్క్ పెట్టుకోవాలని చెప్పినందుకు ఆగ్రహించిన మేనేజర్... ఉద్యోగినిపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. అడ్డుకున్న తోటి ఉద్యోగులపైనా ఆగ్రహం వెళ్లగక్కాడు.
రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో వెలుగులోకి వచ్చింది. మహిళా ఉద్యోగి నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు డిప్యూటీ మేనేజర్ భాస్కర్ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలించిన అధికారులు చర్యలకు సిఫార్సు చేశారు.
And all he gets is a suspension thats about it
What times are we living in
Our species has to end
Humanity is dead https://t.co/ZBTFXYFbpK — rashmi gautam (@rashmigautam27) June 30, 2020