బ్రేకింగ్ : బీహార్ సీఎం కి కరోనా పరీక్షలు
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శనివారం కరోనా వైరస్ పరీక్షలు చేయించుకున్నారు. గత కొన్ని రోజుల నుంచి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ముందస్తుగా కరోనా పరీక్షలు చేయించుకున్నారు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్. అయితే ఆయన శాసన మండలి చైర్మన్ అవధేష్ నారాయణ్ సింగ్ తో కలిసి ఓ కార్యక్రమానికి హాజరయ్యారు ఆ తర్వాత అవధేష్ కి కరోనా వైరస్ బారిన పడ్డారని తెలియడంతో వైద్యులు సీఎం కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. దీంతో తాజాగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కరోనా పరీక్షలు చేస్తున్నారు.
కాగా శాసనమండలి చైర్మన్ అవినాష్ నారాయణతో పాటు ఆయన భార్య పిల్లలు కూడా పాజిటివ్ అని తేలింది. గత కొన్ని రోజుల నుంచి ఆయనతో సన్నిహితంగా మెలిగిన వారందరూ ప్రస్తుతం కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారు.