రాజధాని మార్పుపై ఏకపక్ష నిర్ణయం రైతులను అవమానించడమే : పవన్ కళ్యాణ్

Reddy P Rajasekhar

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజధాని అమరావతి కోసం రైతులు చేస్తున్న పోరాటం 200 రోజులు పూర్తైన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. రైతులు చేస్తున్న పోరాటానికి పవన్ తన సంఘీభావాన్ని ప్రకటించారు. పవన్ మాట్లాడుతూ రైతులు రాజధాని కోసం 34,000 ఎకరాలు త్యాగం చేశారని అన్నారు. జగన్ సర్కార్ రాజధాని మార్పుపై ఏకపక్ష నిర్ణయం రైతులను అవమానించడమేనని చెప్పారు. రాజధాని కోసం పోరాడుతున్న రైతులకు జనసేన మద్దతు ఉంటుందని తెలిపారు. 
 
రాజధాని రైతులు, మహిళలు గడిచిన 200 రోజులుగా అమరావతిని మాత్రమే రాజధానిగా ఉంచాలని పోరాటం చేస్తున్నారని రైతులను త్యాగాలను జనసేన ఎట్టి పరిస్థితుల్లోను వృథా కానీయదని అన్నారు. రాజధాని రైతుల పోరాటం 200 రోజులు పూర్తైన సందర్భంగా టీడీపీ నేతలు జగన్ సర్కార్ పై తాజాగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: