బ్రేకింగ్ : దళితుల ఇళ్లను కూల్చివేసిన అధికారులు...
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పంలో లబ్ధిదారులకు ఇచ్చిన ఇళ్లను రాత్రికి రాత్రే కూల్చివేయడం ప్రస్తుతం ఎంతో చర్చనీయాంశంగా మారింది. అధికారులు తమకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా తమ ఇళ్లను కూల్చివేయటంపై బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో టిడిపి ప్రభుత్వ హయాంలో 20 మంది దళితులకు ప్రభుత్వం ఇళ్లు కేటాయించింది.తాజాగా అధికారులు వాటిని కూల్చివేశారు.దీనిపై చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.