నాలో నాతో వైయస్సార్ : వైయస్ విజయమ్మ
వైయస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయమ్మ దివంగత సీఎం, ప్రియతమ నేతపై మరో పుస్తకం రాశారు. నేడు మహానేత వైయస్సార్ జయంతి సందర్భంగా "నాలో...నాతో...వైఎస్సార్" పుస్తకాన్ని నేడు ఏపీ సీఎం జగన్ ఆవిష్కరించనున్నారు. వైయస్సార్ అర్ధాంగిగా విజయమ్మ 37 సంవత్సరాల జీవితసారం ఈ పుస్తకంలో ఉంది. వైయస్సార్ గురించి ప్రజలకు తెలియని ఎన్నో విషయాల గురించి విజయమ్మ ఈ పుస్తకం ద్వారా తెలియజేయనున్నారు.
నిజ జీవితంలో వేర్వేరు పాత్రల్లో రాజశేఖర్ రెడ్డి ఎలా ఉండేవారో ఈ పుస్తకం ద్వారా ఆమె ప్రజలకు తెలియజేయనున్నారు. పేదల, రైతుల, మధ్యతరగతి వర్గాల కోసం వైయస్సార్ చేసిన కృషి వల్లే నేటికీ ఆయనను ప్రజలు ఆరాధిస్తున్నారని... ఆయన జీవితంలో తొలినాళ్ల నుండి మరణం వరకు జరిగిన పరిణామాలన్నీ ఈ పుస్తకంలో పేర్కొన్నారు. రాబోయే తరాలకు కూడా వైయస్సార్ గురించి స్పూర్తి ఇవ్వాలనే సంకల్పంతో ఈ పుస్తకాన్ని ఆమె ప్రజల ముందుకు తెస్తున్నారు.
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, దివంగత వైయస్ఆర్ గారి సతీమణి శ్రీమతి వైయస్ విజయమ్మ గారు రాసిన " నాలో.. నాతో YSR" పుస్తకాన్ని రేపు మహానేత జయంతి సందర్భంగా ఆవిష్కరించనున్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్. #LegendYSRJayanthi pic.twitter.com/gnlxvyupKa — congress PARTY' target='_blank' title='ysr congress-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">ysr congress party (@YSRCParty) July 7, 2020