కరోనా చికిత్సకు ఫీజు ఖరారు చేసిన ఆరోగ్యశాఖ..రోజుకు 3250 రూపాయలు,ఐసీయూలో చికిత్స పొందుతుంటే రోజుకు 5480 రూపాయలు
రాష్ట్రంలోని ఆరోగ్యశ్రీ నెట్ వర్క్,ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్సకు ఫీజు ఖరారు చేస్తూ ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా చికిత్సకు రోజుకు 3250 రూపాయలుగా నిర్ణయించారు.
వెంటిలేటర్, ఎన్ఐవీ లేకుండా ఐసీయూలో చికిత్స పొందుతుంటే రోజుకు 5480 రూపాయలు, ఎన్ఐవీ ఉండి ఐసీయూలో చికిత్స పొందుతుంటే రూ. 5980 రూపాయలు, వెంటిలేటర్ ఉండి ఐసీయూలో చికిత్స పొందుతుంటే 9580 రూపాయలు, వెంటిలేటర్ ఉండి సెప్టిక్ షాక్ చికిత్స చేస్తే రోజుకు 10380 రూపాయలుగా ఖరారు చేశారు.