సిఎం జగన్ కు రామకృష్ణ లేఖ
కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వ వైద్యులు ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఇతోధిక సేవలందిస్తున్నారని వారిని ఇబ్బంది పెట్టవద్దు అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సిఎం జగన్ కు ఒక లేఖ రాసారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వ వైద్యుల సంఘం ఆవేదనా పూరిత లేఖ రాయటం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.
రాష్ట్ర ఆరోగ్య సంక్షేమ శాఖ కమిషనర్ తరచూ ఆచరణ సాధ్యం కాని ఆదేశాలు జారీ చేయడం వల్ల వైద్యులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. గతంలో మాస్కులు గ్లౌజులు లేవన్నందుకు డాక్టర్ సుధాకర్పై అమానుషంగా ప్రవర్తించారని ఆరోపించారు. డాక్టర్ అనితారాణి విషయంలో కూడా అవమానకరంగా ప్రవర్తించారని ఆయన తన లేఖలో మండిపడ్డారు.