ప్రజలకు మోడీ కొత్త పిలుపు

స్ఫూర్తిదాయక కథలను పంచుకోవాలనుకునేవారు 1800-11-7800 నంబరుకు ఫోన్ చేసి, తమ కథలను రికార్డు చేయవచ్చునని  ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఈ నెల 26 న మోడీ మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడతారు. ఈ నేపధ్యంలో సమష్టి కృషితో జీవితాలను మార్చిన సంఘటనల గురించి తనతో పంచుకోవాలని ఆయన ప్రజలను కోరారు. 

 

ఇతరుల జీవితాలను సమష్టి కృషితో మార్చిన సంఘటనలకు సంబంధించిన ప్రేరణాత్మక, స్ఫూర్తిదాయక కథలను పూర్తి వివరాలతో తమకు  పంపాలి అని ఆయన కోరారు. చాలా మంది జీవితాలను మార్చిన  కథల గురించి మీకు తెలుసు కాబట్టి వాటిని మీరు ఈ నెల 26న జరిగే ‘మన్‌  కీ బాత్’ కోసం పంచుకోండని ఆయన ప్రజలను కోరారు. నమో యాప్ ద్వారా పంచుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: