దుబే ఎన్కౌంట్ ఘటనపై కమిషన్ ఏర్పాటు..!
కాన్పుర్లో 8 మంది పోలీసులు హత్య ఘటన, కరుడుగట్టిన వికాస్ దుబే ఎన్కౌంటర్పై విచారణ చేసేందుకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసింది ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం. ఇందుకోసం అలహాబాద్ విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ శక్తికాంత్ అగర్వాల్ను నియమించారు ఆ రాష్ట్ర గవర్నర్ ఆనందీబెన్ పటేల్. నివేదికి సమర్పణకు రెండు నెలలు గడువు ఇచ్చారు.
జులై 2 నుంచి 10 వరకు జరిగిన అన్ని ఎన్కౌంటర్లపై ఈ కమిషన్ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తుందని ప్రభుత్వ అధికార ప్రతినిధి వెల్లడించారు.