న్యూయార్క్లో జీరో కరోనా... ఇది నమ్మాల్సిందే..!
కొద్ది రోజులుగా వరుస కరోనా కేసులతో న్యూయార్క్ నగరం ఎంతలా విలవిల్లాడిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కోవిడ్కు కేంద్రంగా ఉన్న న్యూయార్క్ నగరంలో కేసులు క్రమక్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. నాలుగు నెలల తర్వాత న్యూయార్క్లో ఆదివారం కరోనా కారణంగా ఒక్క మరణం కూడా సంభవించలేదు. మార్చి 11న న్యూయార్క్లో కరోనా తొలి మరణం సంభవించింది.
ఏప్రిల్ 7 నాటికి పరిస్థితి తీవ్రంగా మారింది. ఆ రోజు కోవిడ్ లక్షణాలతో 597 మంది చనిపోగా, ఎలాంటి లక్షణాలు లేకుండా 216 మంది ప్రాణాలు విడిచారు. ఏప్రిల్ 9న అత్యధికంగా 799 మంది చనిపోయారు. ఇక ఇప్పుడు ఒక్క మరణం కూడా లేకపోవడంతో నాలుగు నెలల తర్వాత ఇక్కడ జీరో మరణాలు నమోదైనట్లయ్యింది. ఇది పెద్ద సంచలనంగానే చెప్పుకోవాలి.