పశ్చిమ గోదావరి పోలీసులను వణికిస్తున్న కరోనా వైరస్...!

గోదావరి జిల్లాల్లో కరోనా కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. కరోనా కట్టడికి సమర్ధవంతంగా అధికార యంత్రాంగం పని చేస్తున్నా జిల్లాలో మాత్రం కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పోలీసులకు కరోనా సోకింది. భీమవరం రూరల్ పిఎస్ లో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు కానిస్టేబుల్స్ కి కరోనా సోకింది. 

 

ఆ ఇద్దరూ కూడా ఇటీవల ట్రాఫిక్ విభాగంలో కూడా ఉన్నారు అని సమాచారం. దీనితో స్టేషన్ లో పని చేసే అందరికి కరోనా పరిక్షలు చేస్తున్నారు అధికారులు. వారి వారి కుటుంబాలకు కూడా కరోనా  పరిక్షలు చేయాలి అని భావిస్తున్నారు. ఇక స్టేషన్ లో పని చేసే సిబ్బంది కుటుంబాలు అన్నీ హోం క్వారంటైన్ లో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: