నెరవేరనున్న హిందువుల కల.. ఇంకొన్ని రోజుల్లో.. ?

praveen
దేశ వ్యాప్తంగా హిందువులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అయోధ్యలో రామాలయ నిర్మాణానికి భూమిపూజ ఇంకొన్ని రోజుల్లో జరగనున్నట్లు తెలుస్తోంది.ఆగస్టు మొదటి వారంలో రామాలయ నిర్మాణానికి భూమి పూజ చేయాలని ఆలయ ట్రస్టు నిర్ణయించింది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్య లో పర్యటించనున్న  నేపథ్యంలో ఆయన పర్యటనకు అనుగుణంగానే ఆగస్టు 3, 5 తేదీల్లో భూమి పూజ జరపాలని ఆలయ ట్రస్టు నిర్ణయం తీసుకుంది.



 అయితే ప్రధానిగా నరేంద్ర మోడీ మొదటిసారి అయోధ్య విభాగంలో పర్యటిస్తున్న నేపథ్యంలో... ఈ పర్యటన మరింత ఆసక్తిని  సంతరించుకుంటుంది. ఇప్పటికే ఆలయ నిర్మాణం కోసం భూసార పరీక్షలు కూడా చేపట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో వర్షాకాలం పూర్తి కాగానే... నిధుల సేకరణ జరపడంతో పాటు... ఆలయ నిర్మాణానికి సంబంధించిన డ్రాయింగ్ పనులు  కూడా శర వేగంగా పూర్తి చేస్తామంటూ ఆలయ ప్రస్తుత ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ చెప్పుకొచ్చారు.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: