అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చి బిహార్కు ప్రత్యేక హోదాను ప్రకటించరని.. నితీశ్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఎద్దేవా చేశారు ఆర్జేడీ నేత, మహాకుటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్. జేడీయూ- బిజేపి కలిసి బిహార్ ప్రజలను వెన్నుపోటు పొడిచాయని ఆరోపించారు.బిహార్ ఎన్నికలకు మహాకూటమి మేనిఫెస్టోను విడుదల చేశారు తేజస్వీ. ఈ సందర్భంగా.. బిహార్లో ముఖ్యమంత్రి నితీశ్కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ పాలనపై విమర్శలు గుప్పించారు.
తనను తాను ఓ స్వచ్ఛమైన బిహారీగా అభివర్ణించుకున్నారు తేజస్వీ యాదవ్. నవరాత్రి ప్రారంభమైన రోజున మేనిఫెస్టోను విడుదల చేస్తున్నామని.. ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని తేజస్వీ యాదవ్ వెల్లడించారు. నిరుద్యోగ సమస్యపై పోరాటంతో ముందుకు సాగుతున్నట్టు స్పష్టం చేశారు.
మరింత సమాచారం తెలుసుకోండి: