ఈ జ్యూవెలరీ షాప్ యజమాని ఇంత రిచ్చా...?

ఆంధ్రా తమిళనాడు సరిహద్దుల్లో తృటిలో హెలికాప్టర్ ప్రమాదం తప్పించింది. పొగ మంచు కారణంగా పొలాల్లో హెలికాప్టర్ అత్యవసర లాండింగ్ చేసారు. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు నుండి తిరుమల శ్రీవారి దర్శనానికి  హెలికాప్టర్ లో ఎస్ వి ఎన్ జ్యువలరీ షాప్ అధినేత శ్రీనివాసన్ కుటుంబం బయల్దేరింది. హెలికాప్టర్ లో ఇద్దరు పైలెట్లతో సహా 7 మంది ఉన్నారు. ప్రతికూల వాతావరణం కారణంగా ఆకాశంలో చక్కర్లు కొడుతూ కుప్పం సరిహద్దులోని తిరుపత్తూరు జిల్లా నంగిలి వద్ద పంట పొలాల్లో హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్ అయింది.
విషయం తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న తిరుపతి  పోలీసులు... సంఘటన గురించి ఆరా తీసారు. ఎలాంటి ప్రమాదం జరగలేదు అని గుర్తించారు. వాతావరణం అనుకూలించడంతో మళ్లీ తిరుపతికి హెలికాప్టర్ బయల్దేరి వెళ్ళింది. ఈ ఘటనతో ముందు కంగారు పడినా ఆ తర్వాత ఊపిరి పీల్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: