రైతులకి మద్దతు ధర ఇవ్వకపోతే మూడు సంవత్సరాల జైలు శిక్ష...!
వ్యవసాయ ఒప్పందంలో భాగంగా వరి, గోధుమలను కనీస మద్దతు ధర కంటే తక్కువకు కొంటే కనీసం 3 సంవత్సరాలు జైలు శిక్ష విధించేలా ఈ బిల్లులు రూపొందించారు.బిల్లుల విషయమై మంగళవారం సాయంత్రం పంజాబ్ గవర్నర్ వీపీ సింగ్ బద్నోర్ను సీఎం అమరీందర్ కలిశారు. నాలుగు బిల్లులతో పాటు, కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన తీర్మానం గురించి గవర్నర్కు వివరించారు. ఆప్ ఎమ్మెల్యే హర్పాల్ సింగ్ చీమ, శిరోమణి అకాలీదళ్ నేత శరన్జీత్ సింగ్ ధిల్లాన్ సహా పలువురు నేతలు అమరీందర్తో కలిసి రాజ్భవన్కు వెళ్లారు.