జమ్ముకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ (జేకేసీఏ) కుంభకోణం కేసులో నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) పార్టీ అధ్యక్షడు ఫరూక్ అబ్దుల్లా... ఎన్స్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరయ్యారు. ఫరూక్ను ఆరు గంటల పాటు ప్రశ్నించింది ఈడీ. ఫరూక్... ఈడీ ఎదుట హాజరు కావడం ఈ వారంలో రెండోసారి.ఫరూక్... జేకేసీఏకు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రూ. 43.69 కోట్లు దుర్వినియోగం జరిగిందనే ఆరోపణతో ఫరూక్ సహా పలువురిపై 2018లో సీబీఐ కేసు నమోదు చేసింది.
ఈ మేరకే రంగంలోకి దిగిన ఈడీ... 2019 జులైలో ఫరూక్ను తొలిసారి ప్రశ్నించింది.మనీలాండరింగ్ కేసులో జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా... ఎన్స్ఫోర్సమెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట హాజరయ్యారు. ఆరు గంటలపాటు విచారించింది ఈడీ అధికారులు.
మరింత సమాచారం తెలుసుకోండి: