పార్లమెంట్ ప్రాంగణంలో అధికారులకి వింత అనుభవం..!
కరోనా వ్యాప్తిని కట్టడి చేయడంలో భాగంగానే.. ఈ తరహా నిబంధనలను తీసుకువచ్చామని పార్లమెంట్లోని ఉన్నతాధికారులు చెబుతున్నారు.పార్లమెంట్ భవన సముదాయంలో.. పాత్రలను, లంచ్ బాక్స్లను కడుగుతున్నందున డ్రైనేజీకి ఆటంకం ఎదురవుతోంది. ఇది పారిశుద్ధ్య సమస్యలను తెచ్చిపెడుతోంది. దుర్గంధం వ్యాపిస్తోంది. దయచేసి వాష్రూమ్లలో ఎవరూ పాత్రలు కడగవద్దు. పరిశుభ్రతను పాటించడంలో అందరూ సహకరించండి అని లోక్సభ సచివాలయం కోరింది.