దేశ శక్తిసామర్థ్యాలు, విస్తీర్ణం పరంగా భారత్.. చైనాకంటే పెద్దదిగా ఎదగాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భాగవత్ ఆకాంక్షించారు. చైనా విస్తరణవాద ధోరణి గురించి యావత్ ప్రపంచానికి తెలుసని అన్నారు.మహారాష్ట్ర నాగ్పుర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం మహర్షి వ్యాస ఆడిటోరియంలో జరిగిన.. ఆర్ఎస్ఎస్ వార్షిక విజయదశమి కార్యక్రమంలో పాల్గొన్నారు భాగవత్. కరోనా విజృంభిస్తున్న క్రమంలో ఈ ఏడాది కేవలం 50 మంది స్వయంసేవక్లతోనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా.. చైనాకు వ్యతిరేకంగా సైనికపరంగా భారత్ మెరుగ్గా సిద్ధం కావాల్సిన అవసరం ఉందన్నారు.
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) ఏ ఒక్క ప్రత్యేక మతానికి వ్యతిరేకం కాదని పేర్కొన్నారు భాగవత్. వారి జనాభాను పరిమితం చేసేందుకే ఈ చట్టాన్ని తీసుకొచ్చారని.. కొందరు మన ముస్లిం సోదరులను తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. సీఏఏ ద్వారా ఏ ఒక్క భారతీయ పౌరుడికి అన్యాయం జరగదన్నారు. అయితే.. దీని ద్వారా ఎదురైన సమస్యలను పరిష్కరించే చర్యలు చేపట్టే క్రమంలోనే కరోనా వచ్చి.. అన్ని అంశాలను పక్కకు నెట్టిందని చెప్పారు.
మరింత సమాచారం తెలుసుకోండి: