తొలిసారి మీడియాతో మాట్లాడిన దీక్షిత్ తండ్రి...!
నిందితుడు మంద సాగర్ ను మరోసారి విచారించి, వెంటనే శిక్షించాలి. పోలీసులు మా కుటుంబానికి న్యాయం చేస్తారనే నమ్మకం ఉంది అన్నారు. దీక్షిత్ రెడ్డి కిడ్నాప్ ఉదంతాన్ని చూసి హైద్రాబాద్ లో మరో సంఘటన జరిగిందన్నారు. భవిష్యత్ లో ఇది రోల్ మోడల్ గా మారే అవకాశం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. దేశంలో తెలంగాణా పోలీసులు అన్ని రంగాల్లో ముందున్నారు. కానీ దురదృష్టవశాత్తు దీక్షత్ తిరిగిరాలేదు ఇది మా దురదృష్టం అన్నారు.