తెలంగాణా పోలీసులకి అరుదైన గౌరవం
వలస కార్మికుల తరలింపులో అనేక సేవలు అందించడం తదితర అంశాలను పరిశీలించిన స్కోచ్ సంస్థ తెలంగాణా పోలీసులని బంగారు మెడల్ కి ఎంపిక చేసింది. ఈ అవార్డును రాష్ట్ర పోలీసుల తరుపున వర్చువల్ సమావేశంలో సమావేశంలో డీజీపీ మహేందర్రెడ్డి బంగారు స్కోచ్ అవార్డును అందుకున్నారు. ఈ విషయాన్ని ప్రకటిస్తూ ‘కొవిడ్ విధుల్లో అంకితభావంతో నిరంతరం శ్రమించిన పోలీస్ అధికారులు, సిబ్బంది అందరికీ అభినందనలు’ అంటూ డీజీపీ ట్వీట్ చేశారు.