ఏపీ హోం మంత్రి సొంత జిల్లాలో...

జగన్మోహన్ రెడ్డి పాలనలో దయనీయంగా మైనార్టీల పరిస్థితి ఉంది అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఆయన తాజాగా మీడియాతో మాట్లాడారు. 17 నెలల కాలంలో ముస్లిం సోదరులపై విద్వేష దాడులు, హత్యలు విపరీతంగా పెరిగాయి. అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. తాజాగా గుంటూరు లో జరిగిన దాడిని ఆయన ప్రస్తావించారు. గుంటూరులో మౌజం హనీఫ్ పై వైసీపీ శ్రేణుల దాడి హేయం అని మండిపడ్డారు.
రేయింబవళ్లు ముసీదుల నిర్వహణ చూసేటటువంటి మౌజమ్ లపై దాడులకు పాల్పడటం దుర్మార్గం అని ఆయన మండిపడ్డారు. ముస్లిం సోదరులకు రాష్ట్రంలో జీవించే హక్కు లేదా..? అని నిలదీశారు. కుట్రలో భాగంగానే మైనార్టీలపై వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారు అని, హోం మంత్రి సొంత జిల్లాలోనే ఇటువంటి ఘటనలు చోటుచేసుకోవడం దురదృష్టకరం అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: