గ్రేటర్ యుద్దం : పలు ప్రాంతాలలో "రిగ్గింగ్ కలకలం" ..ఘర్షణలు..ఉద్రిక్తత !!
ఒకరినొకరు పరస్పరం దాడి చేసుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. అటు నాచారం డివిజన్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది అక్కడ కాంగ్రెస్ మరియు టీఆర్ఎస్ కార్యకర్తలు కొట్టుకున్నారు.
ఇదిలా ఉంటే మరోచోట రిగ్గింగ్ కలకలం రేపింది. జంగంమెట్ డివిజన్ రెయిన్బజార్ పోలింగ్ బూత్లో ఎంఐఎం కార్యకర్తలు దొంగ ఓట్లు వేయడానికి వచ్చారని బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టి పరిస్థితులపై నిఘా ఉంచారు.