చంద్రబాబుకి షాక్ ఇచ్చిన అధికారులు
విద్యుత్ సరఫరా నిలిపివేయడం దారుణం అని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రభుత్వంతో పాటు అధికారుల కక్ష సాధింపు చర్య అని టీడీపీ నేత, మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డి మండిపడ్డారు. భవిష్యత్తులో ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించిన మాజీ మంత్రి అమర్నాథరెడ్డి... అధికారుల పేర్లు గుర్తు పెట్టుకున్నామని అన్నారు. కాగా చంద్రబాబు మూడు రోజుల పాటు కుప్పంలో పర్యటించి నాయకులతో సమావేశం కానున్నారు.