చంద్రబాబుకి షాక్ ఇచ్చిన అధికారులు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనకు వెళ్ళారు. ఈ సందర్భంగా ఆయనకు అక్కడి నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అయితే ఇక్కడ అధికారుల తీరుపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబు  బాస  చేసిన ఆర్ అండ్ బి అతిథి గృహంకు విద్యుత్ విద్యుత్ సరఫరాను అధికారులు ఆపేశారు.  స్థానిక ఎమ్మెల్యే,మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండగా...
 విద్యుత్ సరఫరా నిలిపివేయడం దారుణం అని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రభుత్వంతో పాటు అధికారుల కక్ష సాధింపు చర్య అని టీడీపీ నేత, మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డి మండిపడ్డారు. భవిష్యత్తులో ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించిన మాజీ మంత్రి అమర్నాథరెడ్డి... అధికారుల పేర్లు గుర్తు పెట్టుకున్నామని అన్నారు. కాగా చంద్రబాబు మూడు రోజుల పాటు కుప్పంలో పర్యటించి నాయకులతో సమావేశం కానున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: