ఒకవైపు దేశంలో కరోనా వైరస్ తిరిగి విజృంభిస్తోంది. మరోవైపు దేశంలో కరోనా అంతానికి వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇక కరోనా వ్యాక్సిన్ వేయించుకునేందుకు చాలా మంది భయపడుతున్నారు. తాజాగా కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న కొద్ది సేపటికే ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మహారాష్ట్రలో జరిగింది. థానే జిల్లా భివాండిలోని ఆసుపత్రిలో కోవిడ్-19 వ్యాక్సిన్ రెండవ మోతాదును ఇచ్చిన కొద్దిసేపటికే 45 ఏళ్ల వ్యక్తి మరణించినట్లు అధికారులు తెలిపారు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న కొద్ది సేపటికే అతడు కళ్లు తిరుగుతున్నట్టు చెప్పాడు. వెంటనే అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించే లోగానే మరణించారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చాకే దీనిపై స్పందిస్తామని వైద్యులు చెపుతున్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: