కౌన్సెల‌ర్ ఏక‌గ్రీవాల్లో వైసీపీ కొత్త రికార్డు...

VUYYURU SUBHASH
ఏపీలో జరుగుతోన్న మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో వైసీపీ రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఎన్నిక‌లు పూర్త‌వ్వ‌కుండానే ఇప్ప‌టికే నాలుగు కార్పొరేష‌న్లు, 15 వ‌ర‌కు మున్సిపాల్టీలు అధికార వైసీపీ ఖాతాలో ప‌డ్డాయి. ఇక ఏక‌గ్రీవాల్లో ఏపీ చ‌రిత్ర‌లోనే ఇదో రికార్డుగా నిలిచింది. ఇప్ప‌టికే మొత్తం 671 కౌన్సెల‌ర్ వార్డులు ఏక‌గ్రీవం అయ్యాయి. ఇందులో వైసీపీ రికార్డు స్థాయిలో 570 వార్డులను ఏకగ్రీవం చేసుకుంది. టీడీపీ ఆరు వార్డుల‌ను ఏకగ్రీవంగా గెలుచుకుంది. బీజేపీ ఒకచోట, స్వతంత్ర అభ్యర్థి మరొక చోట విజయం సాధించారు. ఇక ఏపీలో మునిసిప‌ల్ ఎన్నిక‌లు ఈ నెల 10న జ‌రుగుతుండ‌గా... 14న ఓట్ల లెక్కింపు జ‌రుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: