ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల పరంపరలో ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ప్రస్తుతం కార్పొరేషన్లు, మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. వీటికి గత యేడాదే నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేసి రీ నోటిఫికేషన్ జారీ చేయాలని కోర్టులో వేసిన పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. అయితే దీనిపై కౌంటర్ అఫిడవిట్ వేసేందుకు ఎన్నికల సంఘం సమయం కోరింది. కోర్టు కేసులున్నాయంటూ ఎస్ఈసీ ఆలస్యం చేస్తుందని ప్రభుత్వం తరపు న్యాయవాదులు వాదించారు. తదుపరి విచారణ ఈ నెల 8కి హైకోర్టు వాయిదా వేసింది.
మరింత సమాచారం తెలుసుకోండి: