ప్రతిష్టాత్మకమైన తిరుపతి ఎస్వీయూలో నాటుబాంబుల కలకలం రేపింది. నాటుబాంబు పేలి అడివి పంది, కుక్క అక్కడికక్కడే మృతి చెందాయి. ఎస్వీయూలో నాటుబాంబులున్నట్లు అధికారులు బాంబు స్క్వాడ్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటీన స్క్వాడ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. పెరుమాళ్లపల్లెకు చెందిన ఇద్దరు అనుమానితులను యూనివర్సిటీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇంతటి ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయంలో నాటు బాంబులు పేలడం కలకలం రేపుతోంది. దీని వెనక ఎవరి హస్తం ఉందా ? అన్న కోణంలోనూ విచారణ చేస్తున్నారు.