ఏపీలో ఈ రోజు నుంచి ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ చెప్పారు. 1 నుంచి 10 తరగతి విద్యార్థులకు ఒక్కపూటే తరగతులకు హాజరు అవుతారు. ఉదయం 7.45 నుంచి 11.30 వరకు తరగతులు.. తరువాత మధ్యాహ్న భోజనం ఉంటుంది. ఠశాల నుంచి విద్యార్థులు క్షేమంగా ఇళ్లకు చేర్చటంపై ఉపాధ్యాయులు శ్రద్ద తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎండలు, కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి సురేష్ చెప్పారు. విద్యార్థులకు కోవిడ్ పరీక్షలు నిర్వహణ, మాస్క్ లు ధరించడం, శానిటైజర్ వినియోగం, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సురేష్ ఆదేశించారు.