ఏపీలో కరోనా కేసులు రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 4,228 కరోనా కేసులు నమోదు కాగా... మరణాలు 10 నమోదు అయ్యాయి. ఈ తాజా అప్డేట్తో ఇప్పటి వరకు ఏపీలో 9,32, 892కి కరోనా కేసులు చేరాయి. ఇప్పటివరకు కరోనాతో 7,321 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 25,850 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా నుంచి 8,99,721 మంది రికవరీ అయ్యారు. కరోనా తీవ్రత చిన్నారులపై కూడా అధికంగా ఉండడంతో ఏపీలో స్కూల్ విద్యార్థులు సైతం కరోనాకు ఎక్కువుగా గురవుతున్నారు. దీంతో ప్రభుత్వం మరింత కఠిన నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించుకుంది.