గూడూరు వైసీపీ ఎమ్మెల్యేకు ఘోర అవమానం
గత అసెంబ్లీ ఎన్నికల్లో రోడ్లు, తాగునీటి, ఇతర సమస్యలు తీరుస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అయితే ఆయన ఎమ్మెల్యేగా గెలిచాక ఈ గ్రామం వైపే చూడలేదు.. ఆ సమస్యలు అలాగే ఉన్నాయి. అయితే గ్రామస్తులు ఈ ఉప ఎన్నికల్లో అభ్యర్థులు ఎవ్వరు సమస్యలను గుర్తించలేదని ఎంపీ ఎన్నికలను బహిష్కరించారు. విషయం తెలుసుకున్న గూడూరు సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ బురద గాలి కొత్త పాళెం వెళ్లి ఓటర్లకు సర్ది చెప్పినా వినలేదు. జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ద్వారా సర్ది చెప్పిన ఓటర్లు వినలేదు. చివరకు అక్కడ వారికి సర్దిచెప్పబోయిన వైసీపీ నాయకుడికి దేహశుద్ధి చేశారు.