జ‌గ‌న్‌తో ష‌ర్మిల‌కు యుద్ధం త‌ప్ప‌దా... వాళ్లు భ‌లే ఇరికించేశారే ?

VUYYURU SUBHASH
ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సోద‌రి వైఎస్ షర్మిలకు అన్న‌తో యుద్ధం త‌ప్పేలా లేదు. ఆమె తెలంగాణ‌లోనే పార్టీ పెడుతున్న‌ట్టు చెప్పినా... ఆమె ఏపీ రాజ‌కీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చే అవ‌కాశం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. తాజాగా కొంద‌రు క్రిస్టియ‌న్ సంఘాల నేత‌లు బ్ర‌ద‌ర్ అనిల్‌ను క‌లిసి పార్టీలో ఏపీలో కూడా విస్త‌రించాల‌ని కోరిన వార్త‌లు ఉండ‌గానే తాజాగా ష‌ర్మిల అపాయింట్ మెంట్ ను ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంత మహిళ రైతులు కోరారు.

తమ ఆవేదనను వినిపించేందుకు సమయం ఇవ్వాలని వారు వైఎస్ షర్మిలను కోరారు. తమకు మద్దతుగా ఏపీలోనూ పోరాడాలని షర్మిలకు విజ్ఞప్తి చేశారు. తాము ఏపీలోనూ రాజ‌న్న రాజ్యం కోరుకుంటున్నామ‌ని... 2019 ఎన్నిక‌ల్లో రాజ‌న్న రాజ్యం తెస్తామ‌ని ష‌ర్మిల ప్ర‌చారం చేసిన విష‌యాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఏదేమైనా ష‌ర్మిల అమ‌రావ‌తి రైతుల విష‌యంలో త‌ప్ప‌క స్పందించాల్సి రావ‌డంతో అన్న‌తో ఆమెకు వార్ త‌ప్పేలా లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: