దేశంలో కరోనా రోజు రోజుకు విలయతాండవం చేస్తోంది. కరోనా విలయానికి ఛత్తీస్గఢ్ చిగురుటాకులా వణుకుతోంది. గురువారం అక్కడ 16,750 కేసులు, 206 మరణాలు చోటుచేసుకున్నాయి. మిగిలిన పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలోని పల్లెల్లో కూడా నిబంధనలు పాటించకపోవడంతో కేసుల తీవ్రత మామూలుగా లేదు. దేశంలో మహారాష్ట్ర తర్వాత కరోనా నియంత్రణలో విఫలమవుతోన్న రాష్ట్రాలుగా పంజాబ్, ఛత్తీస్ఘడ్ నిలుస్తాయని ఆరోగ్య శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక, రాజస్థాన్, తమిళనాడు, మధ్యప్రదేశ్, పశ్చిమ్ బెంగాల్, గుజరాత్, బిహార్, ఆంధ్రప్రదేశ్లో 10,000-15,000 మధ్య కేసులు నమోదయ్యాయి.