కని కరోనా: సంగం డెయిరీ కేసులో కరోనా కల్లోలం
సంగం డెయిరీలో అవకతవకలు జరిగాయంటూ డెయిరీ ఛైర్మన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నరేంద్ర, డెయిరీ ఎండీ గోపాలకృష్ణను కొవిడ్ టెస్టుల అనంతరం ఏసీబీ కోర్టులో హాజరుపర్చినట్లు అధికారులు తెలిపారు. కో-ఆపరేటివ్ సొసైటీ రిజిస్ట్రార్ గుర్నాథానికి కూడా కరోనా టెస్టులు చేయించినట్లు తెలిపారు. అతనికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఏసీబీ అధికారులు వెల్లడించారు. గుర్నాథంతోపాటు ఉదయం నుంచి ఉన్న ఏసీబీ అధికారులు తమకు కూడా ఎక్కడ కరోనా సోకిందో అనే ఆందోళనకు గురవుతున్నారు. కోర్టుకు హాజరుపరచకుండానే ప్రభుత్వాస్పత్రిలో గుర్నాథానికి చికిత్స ఇప్పిస్తున్నారు. ఈ కేసులో ఏ1గా narendra KUMAR' target='_blank' title='ధూళిపాళ్ల నరేంద్ర-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">ధూళిపాళ్ల నరేంద్ర, ఏ2గా గోపాలకృష్ణ, ఏ3గా గుర్నాథం ఉన్నారు. ఈరోజు తెల్లవారుజామున వంద మందికి పైగా పోలీసులు పొన్నూరు మండలం చింతలపూడిలోని narendra KUMAR' target='_blank' title='ధూళిపాళ్ల నరేంద్ర-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">ధూళిపాళ్ల నరేంద్ర ఇంటికి చేరుకొని అరెస్ట్ చేశారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.