కలియుగంపై కరోనా మహమ్మారి కాటు కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. సరిగ్గా 30 రోజుల వ్యవధిలో దేశ వ్యాప్తంగా కోటి కేసులు, 90 వేలకుపైగా మరణాలు చోటుచేసుకున్నాయి. తొలి ఉద్ధృతిలో ఇన్ని కేసులు రావడానికి 325 రోజులు, మరణాలు సంభవించడానికి 238 రోజులు పట్టాయి. ఇప్పుడు అంతకు పదిరెట్ల వేగంతో మహమ్మారి చుట్టుముడుతోంది. ఇంత భారీస్థాయిలో ప్రస్తుతం మరే దేశంలోనూ వైరస్ విస్తరించడం లేదు. ఏప్రిల్ ద్వితీయార్ధంతో పోల్చితే... మే తొలివారంలో 8.07% కేసులు, 49% మరణాలు పెరిగాయి.