ఆసుపత్రిలో చేరిన మిల్కా సింగ్

Mamatha Reddy
భారత దిగ్గజ అథ్లెట్‌, 91 ఏళ్ల మిల్కా సింగ్‌ కి కరోనా సోకింది. అయన ఆరోగ్యం దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆసుపత్రిలో చేర్చమంటూ అయన కుమారుడు స్టార్‌ గోల్ఫర్‌ జీవ్‌ మిల్కాసింగ్‌ మీడియాకు తెలిపారు. గత వారమే ఆయనకు పాజిటివ్ రాగ ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకున్నారు. కానీ ఎందుకైనా మంచిదని ఆసుపత్రిలో చేర్చమని, భయపడాల్సిన పని లేదని జీవ్ మిల్కా సింగ్ తెలిపారు. ఇక మిల్కా సింగ్
జకార్తా ఆసియా క్రెడల్లో నాలుగు స్వర్ణాలు,  కామన్వెల్త్‌ గేమ్స్‌లో స్వర్ణం,  టోక్యో లో ఒక స్వర్ణం గెలుచుకున్నారు. ఇక మిల్కా సింగ్ తాను ఆరోగ్యంగానే ఉన్నానని త్వరలోనే కోలుకుంటానని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: