మహారాష్ట్రలో శివసేన హిందూత్వాన్ని మరిచిందని బీజేపీ ఎమ్మెల్యే అతుల్ భట్ఖల్కర్ ఆరోపించారు.ముస్లిం ఓటు బ్యాంక్ కోసం శివసేన ఆరాటపడుతుందని అందుకే కాంగ్రెస్ అసదుద్దీన్ ఒవైసీలతో కలుస్తున్నారని ఆయన ఆరోపించారు. కొత్త ఘాట్కోవర్- ముంఖర్డ్ లింక్ రహదారికి మెయినుద్దీన్ చిస్టి పేరు పెట్టాలని శివసేన ఎంపీ రాహుల్ షెవాలే సీఎం ఉద్దవ్ ఠాక్రేకు లేఖ రాశారు.చేధానగర్,మన్ఖర్డ్ లో 70 శాతం పైగా ముస్లింలు ఉన్నారని అందువల్ల ఆ రహదారికి మెయినుద్దీన్ చిస్టియ పేరుపెట్టాలని శివసేన ఎంపీ లేఖలో ప్రస్తావించారు.అయితే ఈ లేఖకు బీజేపీ ఎమ్మెల్యే అతుల్ భట్ఖల్కర్ తీవ్రంగా స్పందించారు.కేవలం ముస్లిం ఓటుబ్యాంక్ కోసమే శివసేన ఇంలాటి వాటికి దిగజారుతుందని బీజేపీ ఎమ్మెల్యే ఆరోపించారు.