దేశ రాజధాని ఢిల్లీలో అన్లాక్ పక్రియలో భాగంగా రెస్టారెంట్లకి అనుమతి లభించింది. 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో రెస్టారెంట్లు తెరుచుకోవచ్చని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. దీనిని వారం రోజుల పాటు పరిశీలిస్తామని...ఒక వేళ కేసులు పెరిగితే ఆంక్షలను కఠినతరం చేస్తామని ఆయన తెలిపారు.కేసులు పెరగకుండా సాధారణంగా ఉంటే ఇది కొనసాగుతుందన్నారు.ఇప్పటికే సరి బేసి సంఖ్యలో షాపులు తెరుస్తున్న నేపథ్యంలో రెస్టారెంట్లు తెరుచుకోవడం వ్యాపారులకు కొంత ఊరట కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు.