తెలంగాణలో బ్లాక్ ఫంగస్ విజృంభిస్తుంది.కరోనా నుంచి కోలుకున్న తరువాత చాలామంది బ్లాక్ ఫంగస్ బారిన పడుతూ మృతి చెందుతున్నారు.తాజాగా కామారెడ్డి జిల్లాలో మెడికల్ ఆఫీసర్ గోవర్థన్ బ్లాక్ ఫంగస్ బారిన పడి చికిత్సపొందుతూ మృతి చెందారు. మృతి చెందిన గోవర్థన్ ప్రస్తుతం ధర్పల్లి హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్నారు.అయితే ఇటీవల ఆయన తల్లి కూడా కరోనాతో మరణిచడం కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.