జడ్జి రామకృష్ణకు ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. ఈ రోజు ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ని మంజూరు చేసింది.50 వేల పూచికత్తుతో పాటు, కేసు విచారణకు అధికారులకు సహకరించాలని ఆదేశాలను జారీ చేసింది.ఇటీవల సీఎం జగన్పై జడ్డి రామకృష్ణ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారంటూ మదనపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.బి.కొత్తకోట నుంచి మదనపల్లెలో కరోనా టెస్ట్ కోసం వెళ్తుండగా జడ్డి రామకృష్ణని పోలీసులు అరెస్ట్ చేశారు.అయితే ఇటీవల రామకృష్ణపై జైల్లో హత్యాయత్నం జరిగిందనే ప్రచారం జరిగింది.జడ్డిని చంపించేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆయన కుటుంబసభ్యులు ఆరోపణలు చేశారు.