తెలంగాణ రాష్ట్రమంత్రి మల్లారెడ్డికి షాక్ తగిలింది. మంత్రి సోదరుడు చామకూర నర్సింహారెడ్డి పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడ్డారు. గత కొద్దిరోజులుగా నర్సింహారెడ్డి తన మిత్రులతో కలిసి న్యూ బోయిన్ పల్లిలోని మల్లారెడ్డి గార్డెన్స్ లో పేకాట ఆడుతున్నారు. దీనిపై పోలీసులకు సమాచారం అందటంతో ఉత్తర మండలం టాస్క్ ఫోర్స్ బృందం ఆకస్మిక దాడులు చేసింది. ఈ దాడుల్లో నర్సింహారెడ్డితో పాటు మరో పన్నెండు మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడినవారిని విచారణ నిమిత్తం బోయిన్ పల్లి పోలీసుస్టేషన్ కు తరిలించారు. ప్రస్తుతం పోలీసులు వీరిని విచారిస్తున్నారు.