సత్య నాదెళ్ళకి మైక్రోసాఫ్ట్ లో మరో కీలక పదవి

Chaganti
మైక్రోసాఫ్ట్ కార్పోరేషన్ బుధవారం జాన్ థాంప్సన్ స్థానంలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్య నాదెళ్ళను కొత్త చైర్మన్‌గా నియమించింది. స్టీవ్ బాల్‌మెర్ నుండి 2014 లో సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన నాదెళ్ళ, లింక్డ్ఇన్, న్యూయాన్స్ కమ్యూనికేషన్స్ మరియు జెనిమాక్స్ వంటి బిలియన్ డాలర్ల కొనుగోళ్లతో సంస్థ వ్యాపారాన్ని పెంచడంలో కీలకపాత్ర పోషించారు. 


2014లో సాఫ్ట్‌వేర్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ నుంచి ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన థాంప్సన్ లీడ్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా వ్యవహరించనున్నట్లు మైక్రోసాఫ్ట్ కార్పోరేషన్ తెలిపింది. ప్రపంచంలోని అతిపెద్ద స్వచ్ఛంద సంస్థలలో ఒకటైన బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ యొక్క దాతృత్వ పనులపై దృష్టి పెడతానని గేట్స్ బోర్డు నుండి వైదొలిగిన ఒక సంవత్సరం తరువాత ఈ ఉన్నత స్థాయి కార్యనిర్వాహక మార్పు జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: