రోజు రోజుకీ రోడ్డు ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. తాజాగా పెరూలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ బస్సు లోయలో పడిన ఘటనలో మొత్తం 27 మంది దుర్మరణం చెందారు. పెరూలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 27 మంది కార్మికులు మరణించగా, 13 మంది గాయపడ్డారని హోచ్స్చైల్డ్ మైనింగ్ (హెచ్ఓసిఎంఎల్) శుక్రవారం తెలిపింది.
ఈ బస్సు హోచ్స్చైల్డ్ యొక్క పల్లన్కాటా ఆపరేషన్ నుండి పెరూకు దక్షిణాన అరేక్విపా నగరానికి కార్మికులను రవాణా చేస్తోందని చెబుతున్నారు. పెరూ దేశ రాజధాని లిమా నగరానికి 600 కిలోమీటర్ల దూరంలో ఈ దారుణ ప్రమాదం చోటు చేసుకుంది.