తెలంగాణలో కొద్ది రోజులుగా కొనసాగుతూ వస్తోన్న లాక్ డౌన్ను పూర్తిగా ఎత్తి వేశారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ రోజు కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో లాక్ డౌన్ ను పూర్తిగా ఎత్తి వేయాలన్న నిర్ణయానికే ఎక్కువ మంది మంత్రులు ఓటేసినట్టు తెలిసింది. కొద్ది రోజులుగా తెలంగాణలో కరోనా కేసులు చాలా వరకు తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. దేశంలో చాలా రాష్ట్రాలతో పోలిస్తే కరోనా కేసుల సంఖ్య తక్కువుగా ఉండడంతో నైట్ కర్ప్యూ కూడా అవసరం లేదని కేబినెట్ సమావేశం లో చర్చించినట్టు తెలిసింది. ఇకపై రాష్ట్రంలో అన్ని కార్యకలాపాలు యధావిధిగా జరగనున్నాయి. దీనిపై పూర్తి మార్గదర్శకాలు ప్రభుత్వం నుంచి ఈ రోజు సాయంత్రానికి విడుదల కానున్నట్టు తెలుస్తోంది.