ఏపీలో వ్యాక్సిన్ మేళా జోరుగా కొనసాగుతోంది. రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ కోసం ప్రత్యేక వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేసి వ్యాక్సిన్ లు వేస్తున్నారు. వ్యాక్సిన్ లు వేసుకునేందుకు ప్రజలు తరలివస్తున్నారు. అంతే కాకుండా రాష్ట్రంలో సొంత రికార్డును ఏపీ వైద్యారోగ్యశాఖ బ్రేక్ చేసింది. ఈ రోజు ఒక్కరోజే వ్యాక్సినేషన్ 10లక్షల మార్క్ ను దాటేసింది .
ఉదయం నుండి మొత్తం 2,232 కేంద్రాల్లో టీకా కార్యక్రమం కొనసాగుతోంది. ఒక్కరోజులో 6.28 లక్షల గత రికార్డ్ ని బ్రేక్ చేస్తూ 10 లక్షల మార్క్ ని ఏపీ వైద్యారోగ్య శాఖ చేరుకుంది . రాష్ట్రంలో మొత్తంగా 10,93008 మందికి వ్యాక్సినేషన్ వేసి రికార్డ్ బ్రేక్ చేసింది. అంతే కాకుండా వ్యాక్సినేషన్ డ్రైవ్ ముగిసే పాటికి 12 లక్షలు మార్క్ అందుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు .