
అజయ్ దేవగన్ తో దిల్ రాజు.. ఊహించని రీమేక్ ప్రకటన!
ఈ ఏడాది రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అందుకున్న సినిమాల్లో నాంది కూడా ఒకటి. అల్లరి నరేష్ హీరోగా విజయ్ కనకమేడల దర్శకత్వంలో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి ప్రశంసలు దక్కించుకుంది. అదే సినిమాను హిందీలో ఇప్పుడు దిల్ రాజు ప్రొడక్షన్స్ అలాగే అజయ్ దేవగన్ ప్రొడక్షన్స్ కలిపి నిర్మించబోతున్నారు. అయితే దీనికి దర్శకత్వం ఎవరు వహిస్తారు ? ఎవరు నటిస్తారు ? అనే విషయాలు మాత్రం తెలియాల్సి ఉంది.